విశాఖలో విషాదం:యువతి...కనిపించకుండా పోయి...శవమై కనిపించింది
విశాఖపట్టణం జిల్లా మద్దికెర గ్రామంలోని నేసేవీధికి చెందిన దాసరి ఝాన్సీ అనే 20 ఏళ్ల యువతి వారం కిందట కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంకా ఆమె కోసం వెతుకుతుండగానే తన తల్లిదండ్రులు నివాసం ఉండే అనంతపురం జిల్లాలో శవమై తేలింది.వివరాల్లోకి వెళితే...
గుంతకల్లు పట్టణానికి చెందిన దాసరి బోయ భీమన్న కూతురు ఝాన్సీని ఆమె తల్లిదండ్రులు విశాఖపట్టణం జిల్లా మద్దికెర గ్రామంలోని తాతయ్య, అవ్వ రాముడు,ఈరమ్మ దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నదాసరి ఝాన్సీని ఈనెల 12వ తేదీన అవ్వ ఈరమ్మ చదువు విషయమై మందలించింది. దీంతో దాసరి ఝాన్సీ అదే రోజు అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు దాసరి ఝాన్సీ ఆచూకి గురించి వెదుకుతుండగానే అనంతరపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతం వద్ద హంద్రీనీవా కాలువలో ఒక గుర్తు తెలియని యువతి శవం కనుగొన్నారు. ఆ తరువాత విచారణ జరపగా చివరకు ఆమె విశాఖలో ఈ నెల 12 న కనిపించకుండా పోయిన ఝాన్సీగా గుర్తించారు. ఝాన్సీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించారు.