విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో విషాదం:యువతి...కనిపించకుండా పోయి...శవమై కనిపించింది

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం జిల్లా మద్దికెర గ్రామంలోని నేసేవీధికి చెందిన దాసరి ఝాన్సీ అనే 20 ఏళ్ల యువతి వారం కిందట కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంకా ఆమె కోసం వెతుకుతుండగానే తన తల్లిదండ్రులు నివాసం ఉండే అనంతపురం జిల్లాలో శవమై తేలింది.వివరాల్లోకి వెళితే...

గుంతకల్లు పట్టణానికి చెందిన దాసరి బోయ భీమన్న కూతురు ఝాన్సీని ఆమె తల్లిదండ్రులు విశాఖపట్టణం జిల్లా మద్దికెర గ్రామంలోని తాతయ్య, అవ్వ రాముడు,ఈరమ్మ దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నదాసరి ఝాన్సీని ఈనెల 12వ తేదీన అవ్వ ఈరమ్మ చదువు విషయమై మందలించింది. దీంతో దాసరి ఝాన్సీ అదే రోజు అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

Body of Missing Young Girl Found

దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు దాసరి ఝాన్సీ ఆచూకి గురించి వెదుకుతుండగానే అనంతరపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతం వద్ద హంద్రీనీవా కాలువలో ఒక గుర్తు తెలియని యువతి శవం కనుగొన్నారు. ఆ తరువాత విచారణ జరపగా చివరకు ఆమె విశాఖలో ఈ నెల 12 న కనిపించకుండా పోయిన ఝాన్సీగా గుర్తించారు. ఝాన్సీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించారు.

English summary
Family members, police searching for a missing 20 year-old have found the body of a young girl in a canal. Police say the body of a woman who has been missing for a week, has been found.Dasari Jhansi, 20, of Maddikera visakha district, was reportedly last seen february 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X