పరిటాల రవీంద్ర నిజమైన హీరో: దత్తత గ్రామంలో వివేక్ ఒబెరాయ్(పిక్చర్స్)
అనంతపురం: దేశంలోనే ముత్తవకుంట్ల గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో వివేక్ ఒబెరాయ్, మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, జేసీ లక్ష్మీకాంతంలు పర్యటించారు. వీరికి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వివేక్ఒబెరాయ్ మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర నిజమైన హీరో అన్నారు. శ్రీహరిపురం పేరుతో 140 ఇళ్లు నిర్మించిన ఘనత అయనకే ఉందన్నారు. పరిటాల రవీంద్ర స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన జ్ఞాపకార్థంగా ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తకు తీసుకున్నానన్నారు.
ముత్తవకుంట్ల గ్రామ ప్రజలు చాలా తెలివైన వారని, ఈ గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దడం కష్టమైన పనికాదన్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడానికి కంప్యూటర్లు, నీటిశుద్ధి జలాల ఫ్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్డు నిర్మించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు.
అనంతరం మంత్రి సునీత మాట్లాడుతూ.. గ్రామంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వివేక్ ఒబెరాయ్ను కోరారు. పరిటాల రవీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ఎంపీ నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ.. కరవుతో ఏటా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హంద్రీనీవా కాలువ ద్వారా నీరు తెప్పించడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం గ్రామ పురవీధుల్లో చీపుర్లు చేతపట్టి చెత్తను శుభ్రం చేశారు.
వివేక్ ఒబెరాయ్
దేశంలోనే ముత్తవకుంట్ల గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు.
వివేక్ ఒబెరాయ్
మంగళవారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో వివేక్ ఒబెరాయ్, మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, జేసీ లక్ష్మీకాంతంలు పర్యటించారు. వీరికి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
వివేక్ ఒబెరాయ్
ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేశారు. అనంతరం స్మార్ట్ విలేజ్ -స్మార్ట్ గ్రామంలో భాగంగా చైతన్యసభ ఏర్పాటుచేశారు. కాగా, వివేక్ఒబెరాయ్ ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలను పరిటాల శ్రీరామ్ తెలుగులో అనువదించారు.
వివేక్ ఒబెరాయ్
ఈ సందర్భంగా వివేక్ఒబెరాయ్ మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర నిజమైన హీరో అన్నారు. శ్రీహరిపురం పేరుతో 140 ఇళ్లు నిర్మించిన ఘనత అయనకే ఉందన్నారు. పరిటాల రవీంద్ర స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన జ్ఞాపకార్థంగా ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తకు తీసుకున్నానన్నారు.
వివేక్ ఒబెరాయ్
ముత్తవకుంట్ల గ్రామ ప్రజలు చాలా తెలివైన వారని, ఈ గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దడం కష్టమైన పనికాదన్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడానికి కంప్యూటర్లు, నీటిశుద్ధి జలాల ఫ్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్డు నిర్మించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు.
వివేక్ ఒబెరాయ్
అనంతరం మంత్రి సునీత మాట్లాడుతూ.. గ్రామంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వివేక్ ఒబెరాయ్ను కోరారు.
వివేక్ ఒబెరాయ్
పరిటాల రవీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీ నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ.. కరవుతో ఏటా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.