'అద్వానీ అసంతృప్తి నుంచి తిరుగుబాటు దాకా! సోమవారం వరకు ఏమైనా జరగొచ్చు'
అమరావతి: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాయి. శుక్రవారం ప్రవేశ పెట్టినప్పటికీ హౌస్ ఆఫ్ ఆర్డర్ లేదని స్పీకర్ నోటీసును రద్దు చేశారు. సోమవారం మరోసారి పెట్టనున్నారు.
చదవండి: ఎవరితో మాట్లాడలేదు, అందరినీ కూడగట్టను: బాబు ఊహించని ట్విస్ట్, పవన్కు హెచ్చరిక
దీనిపై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చదవండి: చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్
బోండా ఉమ ఆసక్తికరం
అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే బోండా ఉమ మాత్రం ఆసక్తికరంగా మాట్లాడారు. ఇప్పటికే టీడీపీకి పదకొండు పార్టీలు మద్దతిచ్చాయి.
సోమవారం వరకు ఏమైనా జరగొచ్చు
ఇప్పుడు బోండా బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ నుంచి బీజేపీ ఎంపీలు తిరుగుబాటు వరకు మాట్లాడారు. తాము సోమవారం అవిశ్వాసం ప్రవేశ పెడుతున్నామని, అప్పటి వరకు ఏమైనా జరగవచ్చునని ఆయన చెప్పారు.
అద్వానీ సహా సీనియర్ల అసంతృప్తి
మోడీకి కేవలం మిత్రపక్షాలు మాత్రమే దూరం కాలేదని, బీజేపీలోని సీనియర్లను ఆయన దూరం పెట్టారని బోండా ఉమ అన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శతృఘ్ను సిన్హా వంటి వారిని పక్కన పెట్టారన్నారు.
అప్పటి వరకు తారుమారు
ఇటీవల ఉప ఎన్నికల్లోను బీజేపీ వరుసగా ఓడిపోతుందని బోండా ఉమ అన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలో బీజేపీ అసంతృప్తులు తిరుగుబాటు చేస్తే అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. సోమవారానికి తారుమారు కావొచ్చన్నారు.