వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో రోజుకో రకంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు గత టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈఎస్ఐ మందుల స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోట్లు దండుకున్నారని వెలుగులోకి రావటంతో టీడీపీ హయాంలో అవినీతిపై సిట్ ఏర్పాటు చేశారు సీఎం జగన్ . ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు సీఎం జగన్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కామ్ లు చేసి అడ్డంగా దొరికి బీసీలు అంటారా ? చంద్రబాబుపై మంత్రి అనీల్ ఫైర్ స్కామ్ లు చేసి అడ్డంగా దొరికి బీసీలు అంటారా ? చంద్రబాబుపై మంత్రి అనీల్ ఫైర్

సిట్‌కు చట్టబద్ధత లేదు

సిట్‌కు చట్టబద్ధత లేదు

ఇక తాజాగా బోండా ఉమా వైసీపీ పాలనపై, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. పరిపాలన చేయడం చేతగాకే వైసీపీ ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు బోండా ఉమామహేశ్వరరావు. ఇక తమ పరిపాలనలో ఏ తప్పూ జరగలేదని పేర్కొన్న బోండా ఉమా సీఎం జగన్ ఏర్పాటు చేసిన సిట్‌కు చట్టబద్ధత లేదన్నారు. ఒక్క ఇష్యూలో అవినీతి జరిగిందని తేలితే సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తారని బోండా ఉమా స్పష్టం చేశారు. కానీ సీఎం పాలన తుగ్లక్ పాలన కాబట్టి రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు.

మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ వెయ్యాలని డిమాండ్

మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ వెయ్యాలని డిమాండ్

గత ప్రభుత్వ పాలనపై ఎన్ని విచారణలు జరిపినా తమకు అభ్యంతరం లేదు కానీ సీఎం జగన్ పాలనలో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బోండా ఉమా. 9 నెలల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ విచారణ జరిపించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. విశాఖలో 30వేల ఎకరాలు కొన్న జగన్‌పై సిట్‌ ఎంక్వైరీ వేయాలని ఉమా డిమాండ్ చేశారు.

రస్ ఆల్ ఖైమా కేసు నుండి దృష్టి మరల్చటానికే సిట్

రస్ ఆల్ ఖైమా కేసు నుండి దృష్టి మరల్చటానికే సిట్

ఇక పోలీసులను సొంత వ్యవహారాలకు వాడుకుంటున్నారని మండిపడిన ఉమా, ఆడవాళ్లు స్నానాలు చేస్తుంటే డీఎస్పీ డ్రోన్ కెమెరాలు తిప్పారని ముందు మండడంలో ఆ ఘటనకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. ఇక తనపై ఉన్న కేసుల నుండి దృష్టి మరల్చటానికి టీడీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మరల్చటానికే సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

Recommended Video

Union Minister Venkaiah Naidu Praises YSRCP MLA Roja - Oneindia Telugu
కేసుల నుండి బయటపడటం కోసమే ఢిల్లీ వెళ్ళిన సీఎం జగన్

కేసుల నుండి బయటపడటం కోసమే ఢిల్లీ వెళ్ళిన సీఎం జగన్

ఇక అంతేకాదు జగన్‌ కేసులో ముద్దాయిలందరికీ మారిషస్‌ కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు బోండా ఉమ. ఈ కేసుల నుంచి బయట పడటం కోసమే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని సీఎం జగన్ వేడుకున్నారని ఆరోపించారు. అంతేకాదు రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారని ఆరోపించారు. రస్ ఆల్ ఖైమా విషయంలో వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదడంలేదని ప్రశ్నించారు బోండా ఉమా .

English summary
There is no objection to the number of inquiries into the past regime but also the corruption of the CM Jagan regime. Bonda Uma demanded to be held. Bonda Uma also demanded that SIT be prosecuted for alcohol and illegal sand during the 9-month YS Jaganmohan Reddy regime. Uma demanded a SIT Inquiry on Jagan's 30,000-acre property in Visakha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X