హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగాదాతో ఆగిన అంత్యక్రియలు: వధువు సజీవదహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bride killed in a fir accident
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం తుమ్మలగూడెంలో దారుణమైన సంఘటన జరిగింది. మూడు రోజు క్రితం వంశీకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆస్తి తగాదాల కారణంగా యువకుడి అంత్యక్రియలు ఇంకా పూర్తికాలేదు. యువకుడి తాత, నాన్నమ్మ పరారీలో ఉన్నారు. 10 ఏళ్ల క్రితమే వంశీ తల్లిదండ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం ఆగ్రా స్వీట్‌హౌస్ వద్ద ఓ కారు పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వధువు సజీవ దహనం

తెల్లారితే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన యువతి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో మరణించింది. దీంతో పెళ్లివారింట విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని భీముని పట్నం మండలం తాటితూరులో జరిగింది.

తాటితూరుకు చెందిన చిల్ల ఎర్రయ్యమ్మ (18) గురువారం ఉదంయ వంట చేసేందుకు పొయ్యి వెలిగిస్తుండగా నిప్పంటుకుంది. మంటలు శరీరమంతటికీ వ్యాపించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబ సభ్యులు మంటలు ఆర్పారు. బాధితురాలిని కెజిహెచ్‌కు తరలించారు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించింది. శుక్రవారంనాడు ఆమె పెళ్లి జరగాల్సింది.

English summary
Last rituals of a youth, who committed suicide stopped due to property dispute in Nalgonda district. Meanwhile bride dead in a fire accident in Visakhapatnam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X