కడప జెడ్పీ సమావేశం రసాభాస: శ్రీకాంత్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి
కడప జిల్లా జెడ్పీ సమావేశంలో మంగళవారం గందరగోళం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగింది.
కడప: కడప జిల్లా జెడ్పీ సమావేశంలో మంగళవారం గందరగోళం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగింది.
తొలుత అర్బన్ హౌసింగ్ అంశంపై వాగ్వాదం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీటెక్ రవి, శ్రీకాంత్ రెడ్డి వర్గీయులు బల్లల పైన ఉన్న వస్తువులను విసురుకున్నారు. పోడియం ఎదుట వైసిపి సభ్యులు బైఠాయించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలు దొంగలన్నారు. దీనిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
English summary
Btech Ravi versus Srikanth Reddy in ZP meeting.
Story first published: Tuesday, October 31, 2017, 13:45 [IST]