అందుకే రాష్ట్రాన్ని చీకట్లో ఉంచారా?: జగన్, విజయసాయిపై బుద్ధా వెంకన్న సెటైర్లు
అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్లను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత బుద్ధా వెంకన్న దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు ఈ టీడీపీ ఎమ్మెల్సీ.
దొంగలకు చీకటి అంటే ఇష్టం..
‘దొంగలకు చీకటి అంటేనే ఇష్టం అని నిజాన్ని ఒప్పుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను శకుని @VSReddy_MP మామా! అందుకేగా నువ్వు, తుగ్లక్ @ysjagan గారు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసారు. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. వీలుంటే పెట్రోమాస్ లైట్ పట్టుకొని గ్రామాలకి బయలుదేరు.' అంటూ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
మీకు పండగే శకుని మామా అంటూ..
‘దోమలు,ఎలుకల నివారణ కి అంత ఖర్చా అని హడావిడి చేసావ్ కదా ఇప్పుడు రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వచ్చి ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కనుక నువ్వు మీ తుగ్లక్ గ్రామాల్లో అడుగు పెడితే మీకు పండగే శకుని మామా !!'
దోమల బ్యాట్లు తెచ్చుకోమంటూ..
‘గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకుంటే తుగ్లక్ @ysjagan గ్రామాల్లోకి వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు ఢిల్లీ దాటి ఎందుకు రావడం లేదు శకుని @VSReddy_MP మామా ? ఢిల్లీ నుండి వచ్చేప్పుడు రెండు దోమల బ్యాట్లు కొని తెచ్చుకో నువ్వు , తుగ్లక్ దోమలు తొలుకోడానికి పనికొస్తాయి!!' అని అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు.