వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విహారంలో విషాదం: బైరవకొనకు వెళ్తుండగా బస్సు బోల్తా, 15 మందికి గాయాలు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తోండగా యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కురిచేడు దొనకొండ మధ్య గల పొట్లపాడు వద్ద చైతన్య స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. దీంతో 15 మంది వరకు గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 40 మంది నరసరావుపేట డివిజన్ పరిధి, వినుకొండ డివిజన్, వినుకొండకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచి ఉపాధ్యాయులు అని అధికారులు ధ్రవీకరించారు.

bus accident at prakasam district, 15 injured

ఉపాధ్యాయులు బైరవకొన పర్యటనకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడ్డ 15 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కురిచేడు ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స అందజేసి.. నరసరావుపేటకు అంబులెన్స్‌లో తరలించారు. ఆటోను తప్పించబోతుండగా స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ తప్పిదం ఉందా అనే విషయంపై విచారణలో నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

English summary
bus accident at prakasam district. school bus collapse in kurichedu mandal, 15 people are injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X