కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

నెల్లూరు: జిల్లాలోని కావలి మండలం మద్దురపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన సామవేదం సూర్యకుమారి(65), విజయవాడకు చెందిన తాడినాడ ప్రణీత్(25), రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామానికి చెందిన రామదాసు(55)లు అక్కడిక్కడే మృతి చెందారు.

Bus accident in Nellore district: Three killed

ప్రమాద ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న కావలి రూరల్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ట్రావెల్స్ బస్సు బోల్తా: పలువురికి గాయాలు

కర్నూలు జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు గురువారం తెల్లవారుజామున బోల్తాపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలుకాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

English summary
Three killed in a Bus accident occurred in Nellore district on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X