షాకింగ్: బస్సును వేగంగా నడుపుతూ.. రెండు ఫోన్లతో ఆర్టీసీ డ్రైవర్
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలను గాలికి వదిలేసి ఫోన్ను పదేపదే చూస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ నెట్లో బాగా చూస్తున్నారు.
జగన్ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్కు, జైల్లో ఉండి..: బాబు, ముప్పేటదాడి
కడప నుంచి కర్నూలు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ రెండు ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి, ఓ చేత్తో బస్సును నడుపుతూ, మరో చేత్తో ఫోన్లను పదేపదే చూస్తూ డ్రైవింగ్ చేశాడు. సదరు డ్రైవర్ చార్జింగ్ పెట్టడంతో పాటు పదేపదే ఫోన్లను చూస్తూ బస్సును వేగంగా నడిపాడు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. కడప నుంచి కర్నూలు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ విధుల సమయంలో రెండు సెల్ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేశాడు. ఛార్జింగ్ పెట్టిన ఆ ఫోన్లను బస్సు నడుపుతూనే క్షణానికోసారి చూస్తూ బస్సును వేగంగా నడపసాగాడు. అసలే వరుస రోడ్డుప్రమాదాలతో భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు ఈ వీడియో చూసి షాక్కు గురవుతున్నారు.