వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో ప్రారంభం, 2030 నాటికి ప్రపంచమంతా హిందూరాజ్యం: సింఘాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ఏలూరు: 15 ఏళ్లలో ప్రపంచమంతా హిందూ రాజ్యంగా మారుతుందని విశ్వహిందూ పరిషత్ అగ్ర నాయకులు అశోక్ సింఘాల్ శనివారం నాడు అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిందన్నారు.

ఇది సామాన్యమైనది కాదన్నారు. 800 సంవత్సరాల బానిసత్వానికి ఇది ముగింపు అన్నారు. దేశంలో జరగబోయే మార్పులకు ఈ విజయం నాంది అన్నారు. 2020 నాటికి భారత దేశం హిందూ రాజ్యంగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.

2030 నాటికి యావత్ ప్రపంచం కూడా హిందూ సమ్రాజ్యంగా మారుతుందని సత్య సాయిబాబా గతంలోనే తనకు చెప్పారన్నారు. అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

By 2020, India will be Hindu nation, world by 2030: Ashok Singhal

ఆ విప్లవం ఇప్పుడే ప్రారంభమయిందన్నారు. తొగాడియా.. ఆరెస్సెస్ మాజీ సర్ సంఘచాలక్ కెఎస్ సుదర్శన్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది హిందూ సమాజ కల అని, అది త్వరలో నెరవేరుతుందని అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ భాయ్ తొగాడియా ఏపీలో అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన తొగాడియా .. నరసాపురంలో శనివారం నిర్వహించిన హిందూ సమ్మేళన సభలో పాల్గొన్నారు.

English summary
By 2020, India will be Hindu nation, world by 2030: Ashok Singhal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X