వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ జగన్ వయా జనసేన, జేడీ? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

పోలింగ్ తేదీ స‌మీపిస్త‌న్న కొద్దీ టిడిపి అధినేత చంద్ర‌బాబు విప‌క్షాల పై దాడి తీవ్ర‌త‌రం చేసారు. జ‌గ‌న్ పై తీవ్ర స్థాయి లో ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు..ఈ రోజు త‌న ప్ర‌సంగాల్లో జ‌న‌సేన నేత‌ల పైనా ప్ర‌శ్న‌లు సంధించారు. ప‌వ‌న్ ఆషామాషీగా పార్టీ పెట్టారా లేక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పెట్టారా చెప్పాల‌ని డిమాండ్ చేసారు. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి న జెడి ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో జ‌గ‌న్ అక్ర‌మాల గుట్టు విప్పాల‌ని సూచించారు.

మంత్రి నారాయ‌ణ సంస్థ‌ల పై ఐటి దాడులు..!? ఎన్నిక‌ల వేళ టిడిపిలో క‌ల‌వ‌రం..!! మంత్రి నారాయ‌ణ సంస్థ‌ల పై ఐటి దాడులు..!? ఎన్నిక‌ల వేళ టిడిపిలో క‌ల‌వ‌రం..!!

కెసీఆర్ ఖ‌బ‌డ్దార్‌..!

కెసీఆర్ ఖ‌బ‌డ్దార్‌..!

విపక్షం అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తోందని, కానీ తాను దేనికీ భయపడనన్నారు చంద్రబాబు. అవమానిస్తే ఖబడ్దా ర్... జాగ్రత్త అని హెచ్చరించారు. ఒకపక్క తెలంగాణలోని టీఆర్‌ఎస్‌తో పోరాడాలి...మరోపక్క కేంద్రంలో ఉండే మోదీ తో పోరాడాలని అన్నారు. నేడో రేపో దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని సీఎం ఆరోపించారు. బాంబులకే భయపడని తాను దాడులకు భయపడతానా అని ప్ర‌శ్నించారు. ఆంధ్ర ప్రాంతం వారి ఆస్తులపై కేసీఆర్ దాడులు చే స్తున్నారని, ఎవరైనా ఆస్తులు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారని, ఏవైనా భూములుంటే లేనిపోని లిటిగేష న్ల తో అడ్డంకులు స‌ృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలా చేస్తే కేసీఆర్ ఖబడ్దార్ అని హెచ్చరించారు.

జ‌గ‌న్ గుట్టు జెడి విప్పాలి..

జ‌గ‌న్ గుట్టు జెడి విప్పాలి..

జ‌న‌సేన నుండి విశాఖ ఎంపీగా బ‌రిలో ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ వైసిపి అధినేత అక్ర‌మాల గుట్టు విప్పాల‌ని టిడిపి అధినే త చంద్ర‌బాబు డిమాండ్ చేసారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌ను ఆయ‌నే విచారించార‌ని..ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ అక్ర‌మాల ను వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణకు దీటుగా ఉండాలంటే 25 ఎంపీ సీట్లను గెలవాల్సిందేనని బాబు పిలుపునిచ్చారు. ఫ్యాన్ ఇక్కడుంటే స్విచ్ హైదరాబాద్‌లో ఉందని, కరెంట్ ఢిల్లీలో ఉందని, మోదీ కరెంట్ ఇవ్వాలని, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయాలని అప్పుడే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ముసుగులో గుద్దులాట వద్దని ముగ్గురూ రావాలని వారి కథ తేల్చేస్తామని బాబు సవాల్ చేసారు.

ప‌వ‌న్ ఆషామాషీగా పార్టీ పెట్టారా..

ప‌వ‌న్ ఆషామాషీగా పార్టీ పెట్టారా..

చంద్ర‌బాబు తొలి సారిగా త‌న ప్ర‌సంగంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ గురించి ప్ర‌స్తావించారు. కేంద్రం నుండి ఏపికి 70 వేల కోట్ల‌కు పైగా రావాల‌ని తేల్చార‌ని..ఆ త‌రువాత స్పందించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌నసేన అధినేత పవన్ మొన్నటి వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఆంధ్రాకి జరుగుతోన్న అన్యాయంపై నిపుణుల కమిటీ వేసినా తర్వాత ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ ఇన్ని చేస్తున్నా పవన్ ఏమీ మాట్లాడలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టారా.. లేదా ఆషామాషీగా పెట్టారా.. అని బాబు నిల‌దీసారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తొలి సారిగా ప‌వ‌న్ ను..మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల పై ఇప్పుడు వారిద్ద‌రూ ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

English summary
TDP chief Chandra Babu Demand Pawan kalyan to clarify that is he established Janasena for people or just for time pass. Babu also demand ex Jd Lakhsmi Narayana to expose Jagan corruption which he did in his Father tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X