గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్ మనీ వేధింపులు: మరో ప్రాణం బలి, 8 లక్షలకు అసలుకు 24 లక్షలు వడ్డీ

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: కాల్ మనీ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లెలో గురువారం తెల్లవారు జామును ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రేపల్లెకు చెందిన కదరవల్లి రాంబాబు (58) స్థానికంగా గరికపాటి రవి అనే వ్యాపారి వద్ద 8 ఏళ్ల క్రితం 8 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు.

ప్రస్తుతం ఆ ఆ రుణానికి సంబంధించి వడ్డియే రూ. 24 లక్షలు అయింది. మరో వ్యక్తి వేమూరి శ్రీను వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానికి రూ.2 లక్షలు అయింది. అప్పులిచ్చినవారి నుంచి వేధింపులు తీవ్రం కావడంతో ఈ నెల 19వ తేదీన తమ స్వగ్రామం బొబ్బర్లంకలో పొలింలోనే పురుగు మందు తాగి రాంబాబు మరణించాడు.

Call money: man commits suicide in Guntur

మరణవార్త విని స్వగ్రానికి చేరుకున్న కుమారుడు తండ్రి చొక్కా జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చౌడాయపాలెం ఇంచార్జీ ఎస్సై మహ్మద్ షఫీ దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబుకు ఇద్దరు కుమారులున్నారు.

English summary
A man Ramababu committed suicide at Repalle in Guntur district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X