వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి షాక్: జగన్‌పై కేసు నమోదు, టిడిపికి ప్లస్ అవుతుందా?

నంద్యాల మూడో పోలిస్‌స్టేషన్‌లో వైఎస్ జగన్‌పై కేసు నమోదైంది.ఈసీ ఆదేశాల ప్రకారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలను పురస్కరించుకొని నిర్వహించిన పలు ఎన్నికల సభల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ చీఫ్ జగన్‌పై నంద్యాల మూడవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

శిల్పా కోసం పోలీసులు, నంద్యాలలో హైడ్రామా, నేనే వస్తానంటూ అఖిల వార్నింగ్శిల్పా కోసం పోలీసులు, నంద్యాలలో హైడ్రామా, నేనే వస్తానంటూ అఖిల వార్నింగ్

ఈ విమర్శలపై టిడిపి నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది. జగన్ వ్యవహరించిన తీరును ఎన్నికల సంఘం తప్పుబట్టింది.

నంద్యాల బైపోల్:శిల్పా, భూమా ఫ్యామిలీకి కీలకం, 2019కి సైమీఫైనల్స్నంద్యాల బైపోల్:శిల్పా, భూమా ఫ్యామిలీకి కీలకం, 2019కి సైమీఫైనల్స్

జగన్ విమర్శలు ఎన్నికల నిబంధనల కిందకే వస్తాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దరిమిలా కేసులు నమోదు చేయాలని పలువురు టిడిపి నేతలు డిమాండ్ చేశారు.

జగన్‌పై నంద్యాలలో కేసు నమోదు

జగన్‌పై నంద్యాలలో కేసు నమోదు

నంద్యాల ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్ర‌బాబుని కాల్చేయాల‌ని, ఉరితీసినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ నేత‌లు ఫిర్యాదు కూడా చేశారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను పరిశీలించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌ వ్యాఖ్య‌లు క‌చ్చితంగా నిబంధ‌న‌ల‌ ఉల్లంఘ‌న‌ల కిందే వ‌స్తుందని పేర్కొంది. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నంద్యాల‌లోని మూడ‌వ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు ఈ రోజు కేసు న‌మోదు చేశారు. ఐపీసీ 188, 504, 506 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 125 ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

జగన్‌పై టిడిపి ఫిర్యాదు

జగన్‌పై టిడిపి ఫిర్యాదు

పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుండి టిడిపి నేతలు వైసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.ఎన్నికల ప్రచాంరలో వైసీపీ చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా జగన్‌పై కేసులు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుదవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో వైసీపీ చీప్ జగన్‌పై కేసు నమోదైంది.పోలింగ్‌కు ముందుగా రెండు పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే ప్లస్

ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే ప్లస్

నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పోలింగ్ శాతం భారీగా ఉందని... 90 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యం లేదన్నారు.. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని... ఇది టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరిగినప్పటికీ... చివరి క్షణాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఉప ఎన్నికల్లో ఓటింగ్ కు ఉత్సాహం

ఉప ఎన్నికల్లో ఓటింగ్ కు ఉత్సాహం

సాధారణంగా ఉపఎన్నికల్లో ఓటింగ్‌కు ఎక్కువమంది ఆసక్తిని చూపరు. కానీ, నంద్యాల ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది. అయితే పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రయత్నించారు.అయితే మహిళ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారనేది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

English summary
Case filed against Ysrcp chief Ys Jagan in Nandyal three town police station on Wednesday. Ys Jagan made allegations on Ap chiefminister Chandrababunaidu in various election meetings recently held at Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X