దురుసు ప్రవర్తన: జగన్పై నందిగామ పీఎస్లో కేసు నమోదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా మరికొందరిపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నందిగామ ప్రాంతీయ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఇచ్చిన ఫిర్
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా మరికొందరిపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నందిగామ ప్రాంతీయ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు 363 సెక్షన్ కింద నమోదు చేశారు.
మంగళవారం ముళ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆస్పతి వర్గాలు తెలిపాయి.
మృతుల పోస్టుమార్టం రిపోర్టును వైద్యుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ.. వైద్యుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసు ప్రవర్తన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 353, 503, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు
దివాకర్ ట్రావెల్స్ కల్వర్టులో పడిపోవడంతో 10మంది మృతి చెందగా, మరో 30మంది గాయపడిన విషయం తెలిసిందే. పలువురు క్షతగాత్రులు ఈ ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించేందుకు జగన్ ఇక్కడకు వచ్చారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకపోవడంపై ఆయన వైద్యులపై జగన్ మండిపడ్డారు.