ప్రబోధానంద స్వామిపై కేసు నమోదు: సీడీ, పెన్డ్రైవ్లో సాక్ష్యాలు
Recommended Video
అనంతపురం: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద స్వామిపై గుత్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ప్రభోనందపై ఫిర్యాదు చేశారు. అంతేగాక, సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై కేసు నమోదు చేశారు.
మహిళలతో ప్రబోధానంద అసభ్య ప్రవర్తన, హత్యలూ: జేసీ, శిష్యుల ఎదురుదాడి
కాగా, ఇటీవల తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామం వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రబోధానందపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే, తాజాగా గుత్తికి చెందిన టీడీపీ నేత మధుసూదన్ బుధవారం ప్రబోధానందపై ఫిర్యాదు చేయడం, అతని ప్రసంగాల సీడీలు, పెన్డ్రైవ్లు సాక్ష్యాలుగా అందజేయడంతో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే, ప్రబోధానంద ఎక్కడున్నారన్న దానిపై పోలీసుల వద్దా సమాచారం లేనట్లు తెలుస్తోంది. కాగా, స్వామి ప్రబోధానందకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నప్పటికీ చిన్నపొలమడ గ్రామం వద్ద ఉన్న ఆశ్రమాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు.