వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు, వారికి షాక్: సుప్రీం ఓకే, ఆళ్ల ఏమన్నారంటే

రెండేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటి దాకా పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: రెండేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటి దాకా పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.

కలకలం: పాదయాత్ర టైంలో వైసీపీకి భారీ షాక్, పారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరుకలకలం: పాదయాత్ర టైంలో వైసీపీకి భారీ షాక్, పారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరు

Recommended Video

Chandrababu Naidu Safe Or Not in Cash For Vote Case ? - Oneindia Telugu

ఈ కేసులో పురోగ‌తి లేద‌ని, కొన్ని పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని చెబుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు.

పదవుల కోసం ప్రయత్నాలు: సబితను కలిసిన రేవంత్, టీడీపీ నుంచి నేతల జంప్పదవుల కోసం ప్రయత్నాలు: సబితను కలిసిన రేవంత్, టీడీపీ నుంచి నేతల జంప్

ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా లేదని

ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా లేదని

తెలంగాణ ఏసీబీ ఈ కేసులో దర్యాప్తును నిష్పక్షపాతంగా చేయడం లేదని ఆళ్ల పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తుకు అప్పగించాలని కోరారు. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన సుప్రీం దాన్ని స్వీక‌రించింది.

త్వరలో విచారణ తేదీలు

త్వరలో విచారణ తేదీలు

దాంతో పాటు ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామ‌ని కోర్టు తెలిపింది. సుప్రీం స్వీకరించడం టీడీపీ, రేవంత్ రెడ్డిలకు షాక్ అని అంటున్నారు.

తొలి, రెండో ఛార్జీషీట్ల మధ్య తేడా

తొలి, రెండో ఛార్జీషీట్ల మధ్య తేడా

ఓటుకు నోటు వ్యవహారం జరిగి రెండున్నరేళ్లు అయిందని, తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటు చేసుకుందని, తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జీషీటుకు, రెండో ఛార్జీషీటుకు వ్యత్యాసం ఉందని ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని కోర్టు స్వీకరించింది.

ఆళ్ల హర్షం, బాబుది రుజువైంది, ముందుకుపోకుండా ప్రయత్నాలు

ఆళ్ల హర్షం, బాబుది రుజువైంది, ముందుకుపోకుండా ప్రయత్నాలు

కోర్టు ఆదేశాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడని ఆరోపించారు. అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు.

ఆళ్ల లాయర్ మాట్లాడుతూ...

ఆళ్ల లాయర్ మాట్లాడుతూ...

మరోవైపు, ఎమ్మెల్యే ఆర్కే లాయర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు సరిగా చేయడం లేదన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిష్పక్షపాత దర్యాఫ్తు కోసం సీబీఐ విచారణ జరగాలని ఆర్కే పిటిషన్ వేశారన్నారు.

English summary
Cash for vote scam issue has witnessed a new twist. MLA RK has filed a PIL in the Supreme Court appealing to take the note of the case and add it to the main petition. YSR Congress Mangalagiri MLA, Alla Ramakrishna Reddy in his PIL alleged that Telangana ACB is not conducting the probe in a satisfactory manner and appealed that the case should be handed over to CBI. Chief Justice Deepak Mishra heading the three members panel, has decided to take up the case in Supreme Court. In the earlier petition, it was appealed that CM Chandrababu Naidu should be taken as an accused in the cash for vote scam. Very soon, the Supreme Court is likely to take up the case and announce the dates for CBI investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X