టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లో తెలుసా?
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమైంది. 126 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో మూడు కులాలకు చంద్రబాబు పెద్దపీట వేశారు. ముస్లింలకు రెండు సీట్లను మాత్రమే కేటాయించారు. బ్రాహ్మణులకూ అవి కూడా లేవు. తొలి జాబితాలో బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు దక్కలేదు గుంటూరు తూర్పు , విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలిపారు.
తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ కులస్తులకు అధిక సీట్లు దక్కాయి. 126 స్థానాల్లో 32 చోట్ల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టారు. ఈ జాబితాలో వారికే అగ్రస్థానం దక్కింది. వారి తరువాత బీసీలు రెండో స్థానంలో నిలిచారు.
వలసపక్షులతో కాంగ్రెస్ విలవిల .. అయినా ప్రతిపక్ష హోదా కోల్పోవటం అంత ఈజీ కాదు
వెనుక బడిన తరగతుల వారికి 31 సీట్లను కేటాయించారు. అలాగే- రెడ్డి సామాజిక వర్గాలకు 20 స్థానాలను ఇచ్చారు. బలిజ, తూర్పుకాపు అభ్యర్థులను 17 చోట్ల నిలబెట్టారు. ముస్లింలకు రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. కాగా, బ్రాహ్మణులకు ఒక్క సీటూ ఇవ్వలేదు. ఇక వారి ఆశలు మలి జాబితా మీదే ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019