మాజీ మంత్రి సుబ్బరాయుడిపై సిబిఐ చీటింగ్ కేసు
విశాఖపట్నం: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుపై సిబిఐ కేసు నమోదు చేసింది. సుబ్బరాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి నర్సాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి రూ. 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో సిబిఐ రంగంలోకి దిగింది.
కొత్తపల్లి సుబ్బరాయుడితో పాటు ఎస్బిఐ చీఫ్ మేనేజర్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. సిబిఐ అధికారులు అమలాపురం, భీమవరం, హైదరాబాద్లో తనిఖీలు నిర్వహించారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. మార్చి 10వ తేదీ నుంచి అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కమిషన్ పేర్కొంది. నామినేషన్ల గడువు 17న ముగుస్తుంది.
మార్చి 27న పోలింగ్ తోపాటు అదేరోజున ఓట్ల లెక్కింపు ఉంటుందని కమిషన్ తెలిపింది. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సందిగ్ధత నెలకొందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.