విజయవాడ కేసులో సిబిఐ కస్టడీకి భాను కిరణ్
ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి శ్యాంప్రసాద్, అతని సోదరుడు రామకృష్ణప్రసాద్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం కేసులో జోక్యం చేసుకుని బెదిరింపులు, కంపెనీలోకి అక్రమ ప్రవేశం, ఫోర్జరీ సంతకాలు వంటి నేరాలకు పాల్పడినట్లు శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు 2010లో పటమట పోలీసులు భానుపై కేసు నమోదు చేశారు.
సిఐడి గత నెల 23న భానుకిరణ్ను చర్లపల్లి జైలు నుంచి పీటీ వారెంట్పై అరెస్టు చేసి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చింది. భాను కిరణ్ను తమ కస్టడీకి విచారణ కోసం ఆరు రోజులు అప్పగించాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిసిన అనంతరం సోమవారం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
భాను కిరణ్ మద్దెలచెర్వు సూరి అలియాస్ మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడు. మద్దెలచెర్వు సూరి హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.