శాసనసభలో ఆనం వర్సెస్ చంద్రబాబు: తన సీటు వద్దకు ఎందుకు వచ్చారంటూ : సీఎం జగన్ ..నవ్వుతూ...!
Recommended Video
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఊహంచినట్లుగా వాడి వేడిగా మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల పైన సొంత పార్టీ నేతల పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సభలో ప్రభుత్వానికి మద్దతుగా తన వాదన వినిపించారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద కీలక వ్యాఖ్యలు చేసారు. సభలో పీపీఏ ల మీద రగడ చోటు చేసుకుంది. ఆ సమయంలో టీడీపీ నేతలు మంత్రి బుగ్గన చెప్పిన సమాధానం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో..ఆనం జోక్యం చేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం లేదని..స్పీకర్ అవకాశం కల్పిస్తే తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
ఆనం వద్దకు చంద్రబాబు..
సభలో ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్న ఆనసారు. తాను మాట�86డ్డి ప్రతిపక్షం టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద అభ్యంతరం వ్యక్తం చేసారు. తాను మాట్లాడుతుంటే అరాచక శక్తులు అంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించటం పైన ఆనం అభ్యంతరం వ్యక్తం చ�B0�ంలో ఛంద్రబాబప సంహరించుకోవాలని లేదా రికార్డుల నుండి తొలిగించాలని డిమాండ్ చేసారు. ఆ సమయంలో ఛంద్రబాబు నిరసనగా బెంచ్ వద్ద లేచి నిలబడ్డారు. ఆ పక్కనే అధికార పార్టీ బెంచ్ ల్లో కూర్చున్న ఆనం సమీపంలోకి వచ్చారు. దీంతో..ఆనం సైతం తీవ్రంగా స్పందించారు. దీని పైన స్పీకర్ ను ప్రశ్నించారు. విద్యుత్ వ్యవహారాల మీద ఆ శాఖ మంత్రి మాత్రమే మాట్లాడరని..బుగ్గన శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రిగా మాట్లాడారని వివరించారు.
తన సీటు మార్చాంటూ..
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన వద్దకు వస్తే అభ్యంతరం ఉండదని..కానీ, సభ జరుగుతున్న సమయంలోనే ప్రతిపక్ష నేత తన వద్దకు వస్తే ఎలా అని ఆనం ప్రశ్నించారు. ఆయన స్థాయి తనకు లేదని.. తనకు భయం వేస్తోందని ఆనం చెప్పుకొచ్చారు. సభలో ఏ సభ్యుడైనా మధ్యలో మాట్లాడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుందని..అయితే అందుకు చంద్రబాబు తనను అరాచక శక్తి అంటూ వ్యాఖ్యానించటం సరి కాదని వివరించారు. దీంతో..స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలిగిస్తున్నట్లు రూలింగ్ ఇచ్చారు. అయితే, దీనికి అంబటి రాంబాబు సైతం స్పందించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటూ తమ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు అయిన ఆనం సీటు వద్దకు ఎలా వెళ్తారని..అచ్చెన్నాయుడు అడ్డు రాకుంటే చంద్రబాబు ఏం చేసేవారో అంటూ ఎద్దేవా చేసారు.
ఆనం పంచ్ లతో..నవ్వుల్లో జగన్
పార్టీలో ఎవరైనా క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే కఠినంగా ఉంటానంటూనే..ఆనం చేసిన వ్యాఖ్యల మీద సీరియస్ అయిన జగన్ సభలో మాత్రం ఆనం మాట్లాడుతున్నంత సేపు నవ్వుతూ కనిపించారు. ఆనం సభలో పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా తన వాదన వినిపించారు. అదే సమయంలో చంద్రబాబు తన సీటులో నుండి లేచి ఆనం కు దగ్గరగా రావటంతో ఆ సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అధినేత పైన సెటైరికల్ కామెంట్లు చేసారు. దీంతో..ఆనం మాట్లాడుతుండగా.. సీఎం జగన్ నవ్వుతూ కనిపించారు. ఇక, దీని ద్వారా పార్టీలో ఆనం పైన వ్యతిరేకంగా సాగిన చర్చ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఆనం సమస్య ముగిసిపోయినట్లేనంటూ లాబీల్లో చర్చ మొదలైంది.