నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం: తెలుగు ఎంపీలకు చోటు
హైదరాబాద్/అమరావతి: నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించింది కేంద్రం. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది.
వాణిజ్య శాఖ కమిటీ ఛైర్మన్గా మరోసారి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి, పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ను నియమించారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర సభ్యులను పరిశీలిస్తే..
ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా మిథున్ రెడ్డి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు
పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి
వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
హెచ్ఆర్డీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గల్లా జయదేవ్
ఆరోగ్యశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత
న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత
ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి
రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రేవంత్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, లక్ష్మీకాంత్
ఇంధనశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి
కార్మికశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్
రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రెడ్డప్ప, సంతోష్ కుమార్
పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా బండి సంజయ్
కెమికల్ అండ్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నందిగం సురేష్
బొగ్గు , ఉక్కు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్
గ్రామీణ అభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తలారి రంగయ్యను నియమించారు.