నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1600 కోట్లతో చేపట్టనున్న ఈ క్షపిణి పరీక్షకేంద్రం ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కూడా మంజూరయ్యాయి.
తొలి దశ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణమంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. రూ.1000 కోట్లతో డీఆర్డీవో క్షిపణ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది.
ఈ కేంద్రం రెండు దశల్లో ఏర్పాటు కానుంది. మొదటి దశలో రూ.600కోట్లతో పనులు ప్రారంభమవుతాయి. ఈ పనులు అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
కాగా,, రెండేళ్ల కిందటే ఈ క్షిపణి కేంద్రం రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనుమతులు రావాల్సి ఉండటంతో ఆలస్యమైనట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
English summary
Central Government has given green signal to missile test facility at nagayalanka in Andhra Pradesh state.
Story first published: Thursday, June 28, 2018, 21:15 [IST]