వైసీపీలోకి చలమలశెట్టి సునీల్ రీ ఎంట్రీ- జగన్ సమక్షంలో చేరిక- రాజ్యసభ హామీ..
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేత ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్. మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఎంపీ చలమలశెట్టి సునీల్ మాత్రమే. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరఫున ఆయన టికెట్ దక్కించుకున్నా ఓటమి మాత్రం తప్పలేదు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున గట్టిగా పనిచేసిన ఆయన హఠాత్తుగా మనసు మార్చుకుని టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రమంతా వైసీపీ పవనాలు వీస్తుంటే టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను చూసి జాలిపడని వారు లేరు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. తూర్పుగోదావరికి చెందిన వైసీపీ నేతలందరితో కలిసి వచ్చి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
Recommended Video
మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన చలమలశెట్టి సునీల్ ఈసారి రాజ్యసభ సీటు హామీతో వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధికంగా బలవంతుడైన సునీల్ కు స్ధానికంగా కాకినాడలో ఉన్న నేతల మద్దతు కలిసి వస్తోంది. దీంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.