వారం రోజులు విదేశాలకు..! అమరావతిని వదిలి హైదరాబాద్ కు పయనమైన చంద్రబాబు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం విశ్రాంతి కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. కుటుంబసమేతంగా విదేవాలకు వెళ్లి ఓ వారం పదిరోజులు గడిపితే ఎలా ఉంటుందనే అంశంపై ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబును బాగా క్రుంగ దీసినట్టు కనిపిస్తున్నాయి.
బాబు వ్యూహం ప్రకారం కాకుండా కేంద్రంలో బీజేపి అఖండ మెజారిటీతో గెలవడం, ఏపిలో ఘోర పరాజయం కావడం బాబును ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిని ఒదిలేసి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు పయనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్కు పయనమయ్యారు. రెండు రోజుల పాటు హైదరాబాద్లోనే చంద్రబాబు ఉండనున్నారు.
కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురైన సంగతి తెల్సిందే. ఈ విషయం నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు విదేశీ టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.