ఇసి పై చంద్రబాబు ఆగ్రహం: సీఈసి కి ఘాటు లేఖ: స్పందించకుంటే నిరసనకు సమాయత్తం..!
Recommended Video
ఏపిలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం వరుసగా తీసుకుంఉన్న నిర్ణ యాలు..అధికారుల ఏకపక్ష బదిలీల పై టిడిపి అధినేత సీరియస్ గా ఉన్నారు. కొద్ది గంటల్లో పోలింగ్ జరిగే క్రమంలో ఇలా అధికారుల పై చర్యలు తీసుకోవాన్ని నిరసిస్తున్నారు. దీని పై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. ఇక, తానే స్వయంగా ఏపి సీఈవో ను కలిసి ఫిర్యాదు చేయాలని..అవసరమైతే ధన్నా చేయాలని భావిస్తున్నారు.
పోలీసు అధికారుల పై ఇసి వేటు..
ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కేంద్ ఎన్నికల సంఘం ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. కోయ ప్రవీణ్ ను బదిలీ చేసి ఆయన స్థానం లో మరొకరికి బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా మంగళగిరి సిఐ ను బదిలీ చేసింది. కొద్ది రోజుల క్రితం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇసి బదిలీ చేసింది. అప్పటికే ఇంటలిజెన్స్ ఏడిజి తో పాటుగా రెండు జిల్లాల ఎస్పీలను ఎన్నికల విధుల నుండి తప్పించింది. దీని పై టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని మోదీ ఎన్నికల సంఘం పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇక, తాజాగా గుంటూరు ఎంపి అభ్యర్ది జయదేవ్ ఆడియ్ పైనా ఐటి అధికారులు దాడులు చేసారు. దీని పైనా టిటిడిపి ఆగ్రహంగా ఉంది. వెంటనే చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి నిరసన లేఖ రాసారు.
పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..బాబు లేఖ
టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. అందులో తొలి నుండి ఎన్నికల సంఘం తీసు కున్న నిర్ణయాలు ప్రస్తావించారు. ఈ నిర్ణయాలు తీసుకొనే సమయంలో అధికారుల నుండి కనీస వివరణ తీసుకోకుం డా ఏకపక్షంగా వ్యవహరించటం పక్షపాతం గా చూడటం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏపి సీయస్ ను బదిలీ చేసి కొత్త వారి పేరు సిఫార్సు చేసారు. ఎన్నికల కమిషన్ బిజెపి ఆదేశాల మేరకు వైసిపికి అనుకూ లంగా పనిచేస్తోందనే విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. టిడిపి ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిగ ణలోకి తీసుకోవటం లేదని..వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల పై మాత్రం తక్షణం స్పందిస్తోందని బాబు లేఖలో వివరించారు.ఇవన్నీ ఈసీ పక్షపాతానికి నిదర్శనంగా చంద్రబాబు విశ్లేషించారు.
సీఈవో ను కలిసి..అవసరమైతే నిరసన..
తాను కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను తానే స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే లేఖ ను రాజ్యసభ సభ్యుడు రవీంద్ర బాబు ద్వారా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపా రు. ఇక, రాష్ట్ర సీఈవో ఇచ్చే సమాధానం ఆధారంగా తరువాతి అడుగు వేయాలని భావిస్తున్నారు. అవసరమైతే అంబే ద్కర్ విగ్రహం వద్ద నిరసన చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.