వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ‌ద్దులు దాటుతున్నారు : కేసీఆర్..జ‌గ‌న్ ద‌ర్మార్గాల‌కు పాల్ప‌డుతున్నారు: సీయం ఫైర్‌...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Cm Chandra Babu Warned Telanganga Govt And YCP Cheif Jagan | Oneindia Telugu

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..వైసిపి అధినేత జ‌గ‌న్ పై ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. ఏ వ్యక్తికై నా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండి పడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు.

వారివి పిల్ల చేష్ట‌లు..

వారివి పిల్ల చేష్ట‌లు..

పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తున్నారని ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ ప్ర‌భ త్వం పై మండి ప‌డ్డారు. అహంకారం నెత్తికెక్కి తెరాస విపరీత చేష్టలకు పాల్పడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు దుయ్యబట్టారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండిపడ్డారు. ఎవరైనా సమాచారాన్ని ఇకపై హైదరాబాద్‌లో పెడతారా అని ముఖ్యమం త్రి ప్రశ్నించారు. అహంభావంతో కేసీఆర్‌, అసహనంతో జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్ర హం వ్యక్తంచేశారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిప డ్డారు. ఏ పార్టీకి లేని సాంకేతికత తెదేపా సొంతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

24 ఏళ్లు క‌ష్ట‌ప‌డిన డేటా..

24 ఏళ్లు క‌ష్ట‌ప‌డిన డేటా..

తెలుగుదేశం పార్టీ 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే.. దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని సీఎం దు య్యబట్టారు. ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసు లు పెడుతున్నారని మండిపడ్డారు.మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి ప్రచారం చేయాలని.. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్‌కు సామంత రాజుగా జగన్ మారారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ని సా మంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్‌ కుట్ర అని ఆరోపించారు. జగన్‌ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని సీఎం మండిపడ్డారు.

చూస్తూ ఊరుకోం..

చూస్తూ ఊరుకోం..

అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వి నియోగం చేయడం నేరమని పేర్కొన్నారు. నేరస్థుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని చంద్రబాబు మం డిపడ్డారు. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం తోనే జగన్‌ అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైకాపా తప్పుడు విధానాలను ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం ర్యాలీలు నిర్వహించాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

English summary
AP Cm Chandra Babu Warned Telanganga govt and YCP Cheif Jagan. Babu says kcr misusing his power to help Jagan i coming elections. Babu clarified that Data collected in 24 years that not govt data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X