చంద్రబాబు పిట్టల దొర , తుపాకీ రాముళ్ళను మించిపోయాడు... 30 సీట్లు కూడా రావన్న విజయసాయి
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు పిట్టలదొరలను, తుపాకీ రాముళ్ళను మించిపోయాడని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ఈసారి కనీసం టీడీపీకి 30 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
గ్రామాల్లో ప్రజలకు వినోదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేసిన ఆయన చంద్రబాబుపై ఒంటికాలిపై లేచారు. తన అనుకూల మీడియాలో ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్రబాబు కథనాలు రాయించుకుంటున్నారని మండిపడ్డారు . ఆయన ప్రధాని కావడం ఏమోకానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని చెప్పిన విజయసాయి రెడ్డి ఏపీలో టీడీపీకి మరీ 30 స్థానాలే వస్తాయని చెప్పి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. .
చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ..''ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకీ రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు. రాష్ట్రంలో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేదు. అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నాడని 'కలల' కథనాలు రాయించుకుంటున్నాడు. ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం'' అని ట్వీట్ చేశారు.