వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెయ్యలేక కుట్ర, ఇవ్వం: బాబుపై టి మంత్రి, జగన్‌పార్టీ...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎపిలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని గవర్నర్ నరసింహన్‌కు లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేయడం విడ్డూరమన్నారు. ఎపి విద్యార్థులకు తాము ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Chandrababu conspiracy on Telangana: Jagadeeshwar Reddy

కెసిఆర్‌కు శంకర రావు అభినందన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మాజీ మంత్రి శంకర రావు అభినందనలు తెలిపారు. గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ కట్టడాలు తొలగించినందుకు శంకర రావు అభినందనలు తెలిపారు. అలాగే భూదాన్ భూముల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

అయోమయంలో పడేస్తున్నారు: ఉమ్మారెడ్డి

రైతులు అయోమయానికి గురి చేసేందుకే టీడీపీ ప్రభుత్వం రుణమాఫీని ఆధార్‌తో లింక్ పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఏ ప్రభుత్వ పథకానికి ఆధార్‌తో లింక్ వద్దంటూ గతంలో సుప్రీం కోర్టే చెప్పిందన్నారు. టీడీపీ ప్రభుత్వం భేషరతుగా రుణమాఫీ చేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.

English summary
AP CM Chandrababu Naidu conspiracy on Telangana says, Telangana CM Jagadeeshwar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X