చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి శకంగా మిగిలిపోతుంది: చంద్రబాబు దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం

|
Google Oneindia TeluguNews

అమరావతి: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

రాజకీయ యోధుడిని దేశం కోల్పోయిందన్నారు. అటు సాహిత్య రంగం, చలన చిత్ర రంగం, పత్రికా రంగం, రాజకీయ రంగంలో ఘనాపాఠి అని, తన సేవాభావం, పాలనా అనుభవంతో తమిళ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు.

రచయితగా, కళాకారునిగా, పత్రికా సంపాదకునిగా, రాజకీయ వేత్తగా, పరిపాలకుడిగా చెరగని ముద్రవేశారన్నారు. కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు భారతదేశానికే తీరనిలోటన్నారు. నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించారని అన్నారు.

5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు శాసనసభ్యునిగా, 50 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా, 75 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం, మార్గదర్శకం.. అని పేర్కొన్నారు. తాను నమ్మిన ద్రవిడ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లారని కీర్తించారు.ఆయన జీవిత కాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డిఎంకె కార్యకర్తలకు, తమిళ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Chandrababu expresses deep sorrow over passing away of Karunanidhi
English summary
Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu expressed deep sorrow over passing away of DMK President and Former Chief Minister of Tamil Nadu M. Karunanidhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X