అభివృద్దిలో కీలకం కానున్న ప్లైఓవర్కి బాబు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు కనకదుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 250 కోట్ల వ్యయంతో ఈ ప్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి పంపాలని అధికారులకు సూచించారు.
అసెంబ్లీలోని
తన
ఛాంబర్లో
జిల్లా
మంత్రి
దేవినేని
ఉమామహేశ్వరరావుతో
పాటు
ఎంపీలు
కేశినేని
నాని,
కొనకళ్ల
నారాయణ,
ఇతర
ఎమ్మేల్యేలతో
సమావేశమై
ప్లైఓవర్
నిర్మాణం
గురించి
చర్చించారు.
ఈ
ప్రాజెక్టు
త్వరగా
పూర్తి
అవ్వాలంటే
ఎంపీలు
కేశినేని
నాని,
కొనకళ్ల
నారాయణ
నిరంతరం
కేంద్రంతో
సంప్రదింపులు
జరపాలని
సూచించారు.
ఈ ప్లైఓవర్ నిర్మాణం చాలా అవసరం. కనకదుర్గగుడి వద్ద నిర్మించే ఈ ప్లైఓవర్ హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే రహదారిలో ఉంది. అంతే కాదు విజయవాడని చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా విజయవాడను మరింత ముందుకి తీసుకెళ్లడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది, అక్కడ ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటన్న వివరాలతో నివేదికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను శివరామకృష్ణన్ కమిటీకి కూడా సమర్పించింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సందర్భాల్లో విజయవాడ - గుంటూరు మధ్యలోనే రాజధాని అని కూడా ప్రకటించడంతోపాటు సహచరులకు కూడా ఇదే సంకేతాలు ఇప్పటికే పంపించిన విషయం తెలిసిందే.