జెసి దివాకర్రెడ్డికి బాబు షాక్: ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందే
ట్రావెల్బ్యాన్ వివాదానాన్ని పరిష్కరించుకోవాలని అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
అమరావతి: ట్రావెల్బ్యాన్ వివాదానాన్ని పరిష్కరించుకోవాలని అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ విషయంలో ఎయిర్పోర్ట్ సిబ్బందిపై ఎంపీ జెసి దివాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రింటర్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆరోజునుండి విమానాయానసంస్థలు ఆయనపై ట్రావెల్ బ్యాన్ను విధించాయి. రెండురోజులక్రితం ఆయనను విమానంలో ఎక్కకుండా కొన్ని ప్రైవేట్ విమానసంస్థలు అడ్డుకొన్నాయి. విజయవాడకు వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్న జెసి దివాకర్రెడ్డిని ట్రూజెట్ ఎయిర్లైన్స్ సంస్థ అడ్డుకొంది.
అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చంద్రబాబునాయుడు అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డికి సూచించారు. ప్రజాజీవితంలో సహనం ఉండాలని ఆయన జెసికి సూచించారు.
మరోవైపు కేంద్రమంత్రి ఆశోక్గజపతిరాజుతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.