నా ముందు చంద్రబాబు పెద్ద జీరో: పెద్దిరెడ్డి, అమర్నాథ్కు మంత్రి పదవి వెనుక..
తనను రాజకీయంగా సాధించడానికే తమ పార్టీ నుంచి గెలిచి, టిడిపిలో చేరిన అమర్నాథ్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారని వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆసక్తికర వ్యా
విజయవాడ: తనను రాజకీయంగా సాధించడానికే తమ పార్టీ నుంచి గెలిచి, టిడిపిలో చేరిన అమర్నాథ్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారని వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలోను డిసిసి అధ్యక్షుడిగా జిల్లా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని చెప్పారు. నాటికి, నేటికి తన ముందు చంద్రబాబు పెద్ద జీరో అన్నారు.
జగన్! మా వాళ్లతో వైయస్ ఓటు వేయించారు, అప్పుడేమైంది: రాష్ట్రపతికి ఫిర్యాదుపై చంద్రబాబు
రాష్ట్రం విడిపోవడానికి కారణం గవర్నరే అని తీవ్ర ఆరోపణలు చేశారు. అదే గవర్నర్ ఫిరాయింపుదారులతో అనైతికంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారని మండిపడ్డారు. చంద్రబాబు గిరిజనులు, మైనార్టీల ద్రోహి అన్నారు.
కాగా, చంద్రబాబు 2019 ఎన్నికలు టార్గెట్గా ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిపిన విషయం తెలిసిందే. వైసిపి నుంచి వచ్చిన అమర్నాథ్ రెడ్డితో పాటు సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియలకు చోటు కల్పించారు.
ఈ జిల్లాల్లో వైసిపి హవా ఉంది. ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్తో చిత్తూరులో అమర్నాథ్ రెడ్డికి, విజయనగరంలో సుజయకు, కడప జిల్లాలో ఆదినారాయణకు, కర్నూలులో అఖిలప్రియకు చోటు కల్పించారు. అలాగే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను వైసిపి హవా ఉంది. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తెరపైకి తెచ్చారు.