విభజనపై బొత్స సంచలనం, లేదంటే సీమని వదిలేస్తారు: బాబుకు డిఎల్ షాక్
కడప/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూల కారణం తెలుగుదేశం పార్టీయేనని ఆరోపించారు. బొత్స ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది ప్రజా పాలన కాదని, రాజకీయ వ్యాపారం అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.
చంద్రబాబుపై డిఎల్ హాట్ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వేరుగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ కోసం అందరం ఐక్యంగా ఉద్యమించాలని సీమ నేతలకు సూచించారు. లేదంటే చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెవెన్యూ, పోలీసు శాఖల్లో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు.