తెలుగు విద్యార్థులపై దాడి చేస్తే సహించం: చంద్రబాబు హెచ్చరిక
కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడిగులు డ్డుకుంటున్న ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కే
అమరావతి: కర్ణాటకలోని హుబ్లీలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరెందుకొచ్చారు?: తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి, ఎందుకంటే..?
ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. సీఎం అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర కర్ణాటక సీఎస్తో మాట్లాడారు. ఆదివారం, సోమవారం జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు.