వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు విద్యార్థులపై దాడి చేస్తే సహించం: చంద్రబాబు హెచ్చరిక

కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడిగులు డ్డుకుంటున్న ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కే

|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్ణాటకలోని హుబ్లీలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరెందుకొచ్చారు?: తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి, ఎందుకంటే..?మీరెందుకొచ్చారు?: తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి, ఎందుకంటే..?

ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. సీఎం అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

chandrababu naidu fires at Hubli incident

ఈ క్రమంలో ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. ఆదివారం, సోమవారం జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday fired at Hubli incident(Telugu people attacked by Kannada leaders).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X