'చంద్రబాబుకు ముఖం చూపలేకపోతున్నాం, ఎందుకంటే'?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకొన్నస్థాయిలో మెజారిటీని సాధించలేకపోయామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు.అనుకొన్న మెజారిటీని రాకపోవడంతో ముఖ్యమంత్రికి ముఖం చూపించలేకపోతున్నట్టు చెప్పారు
అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకొన్నస్థాయిలో మెజారిటీని సాధించలేకపోయామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు.అనుకొన్న మెజారిటీని రాకపోవడంతో ముఖ్యమంత్రికి ముఖం చూపించలేకపోతున్నట్టు చెప్పారు.
మెజారిటీ అంశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రస్తుతం తమ ముందున్న అతి పెద్ద టాస్క్ కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలకు ఆ ఎన్నికల్లో సమన్వయంతో కలిసి పనిచేస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో తనకు అత్యంత ప్రాధ్యాన్యత ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు.రానున్న రోజుల్లో కూడ మరింత సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ వార్తాలు నిరాధారమైనవిగా ఆయన చెప్పారు.