చంద్రబాబు మెదడు సరిగా పనిచేయడం లేదు, ఇసుక దీక్షపై బోత్స ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మెదడు సరిగా పనిచేయడం లేదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుగనున్న సంధర్భంలో చంద్రబాబు ఇసుక దీక్ష చేపట్టడంపై ఆయన మండిపడ్డారు.
దీక్ష చేసేందుకు ఆ రోజును ఎంపిక చేసుకోవడంపై తీవ్రంగా దుయ్యబట్టారు. ఎప్పుడు ఏం చేయాలో తెలియని చంద్రబాబు రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని అన్నారు. ఇంకా రాజకీయాల్లో ఉండి ఎం సాధిస్తాడని అన్నారు. చంద్రబాబు భవితవ్యంతోపాటు వ్యక్తిగతంగా పతనమయ్యారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా 12 గంటల దీక్షకు సిద్దమయ్యారు. ఈ నెల 14న విజయవాడలో ఈ దీక్ష చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే ఆయన దీక్షపై మంత్రి బోత్స సత్యనారయణ ఫైర్ అయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకుండా సర్వే ఆఫ్ ఇండియా మ్యాపును విడుదల చేసిన విషయం తెలిసిందే... ఇక అమరావతి పేరును మ్యాప్ల్లో లేకుండా చేసిన ఘనత కూడ మాజీ చంద్రబాబునాయుడుతో పాటు , ఎంపీ సుజనా చౌదరిలదేనని అన్నారు.