వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై అంత అవసరంలేదు: బాబు సీరియస్, అనంతపురం వరదలపై ఆశ్చర్యం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

'నమ్మొచ్చా, మోడీ మోసం చేశారని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా, బాబు వేస్ట్ ఫెలో''నమ్మొచ్చా, మోడీ మోసం చేశారని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా, బాబు వేస్ట్ ఫెలో'

మంగళవారం అమరావతిలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.

సర్వే నివేదికలు ఉన్నాయి

సర్వే నివేదికలు ఉన్నాయి

ప్రతి ఒక్కరి ప్రవర్తనపై సర్వే నివేదికలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తన నుంచి సమాచారం తీసుకొని పని చేయడం సరికాదని ఆయన నేతలకు హితబోధ చేశారు. మీ అంతట మీరే పని చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదించాలని చెప్పారు.

పవన్ కళ్యాణ్ విషయంలో అంత అవసరం లేదు

పవన్ కళ్యాణ్ విషయంలో అంత అవసరం లేదు

ఇటీవల పవన్ కళ్యాణ్‌ వ్యవహారంలో పలువురు నేతలు అసందర్భంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌పై మంత్రి పితాని ఎప్పుడూ మాట్లాడినట్లు మాట్లాడేశారని, అంత అవసరం లేదన్నారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

సానుకూలత పెరిగింది

సానుకూలత పెరిగింది

ఇంటింటికీ టిడిపిలో ప్రజాస్పందన బాగుందని, ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని చంద్రబాబు అన్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో 16 శాతం సానుకూలత పెరిగిందన్నారు.

రాజమౌళికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాజమౌళికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు

దర్శకులు రాజమౌళికి సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఫిల్మ మేకర్ దిగ్గజానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మీరు ఇలాగే స్క్రీన్ పైన మ్యాజిక్ చేస్తూ ఉండాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అనంత వరదలపై చంద్రబాబు ఆశ్చర్యం

అనంత వరదలపై చంద్రబాబు ఆశ్చర్యం

ఇదే భేటీలో అనంతపురంలో వరదలపై చంద్రబాబు స్పందించారు. అనంతపురంలో వరదలు ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. రాయలసీమలో కరువు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే అన్ని ఏకపక్ష ఎన్నికలే అన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Tuesday took class to party leaders for responding on Jana Sena chief Pawan Kalyan and Telangana Chief Minister K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X