అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్లీ ప్రాజెక్టు కేసు, అరెస్ట్ వారెంట్: కోర్టుకు హాజరుపై చంద్రబాబు కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబ్లీ కేసులో బాబుకు నోటీసులు.. అరెస్ట్ వారెంట్

అమరావతి: బాబ్లీ ప్రాజెక్టు కేసు వ్యవహారంలో తన తరఫున న్యాయవాదిని పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్ణయించారు. తన తరఫున రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, ఇతర అధికారులతో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఇటీవల చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై పలువురితో చర్చించిన అనంతరం లాయర్‌ను పంపించాలని, రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.

కోర్టుకు హాజరవుతా, కేసీఆర్‌ని నన్ను కూర్చోబెట్టొచ్చుగా: బాబు, మిర్యాలగూడ ప్రణయ్ హత్యపై స్పందన కోర్టుకు హాజరవుతా, కేసీఆర్‌ని నన్ను కూర్చోబెట్టొచ్చుగా: బాబు, మిర్యాలగూడ ప్రణయ్ హత్యపై స్పందన

Chandrababu Naidu will send his lawyer to Dharmabad

చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గత గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అప్పుడు పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాన్ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.

బార్డర్ దాటడంతో మహారాష్ట్ర పోలీసులు అప్పట్లో టీడీపీ నేతలను బలవంతంగా బస్సులో ఎక్కించారు. ధర్మాబాద్ నుంచి ఔరంగబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లారు. వారు అనుమతి లేకుండా ప్రాజెక్టు వద్దకు వచ్చారని తరలించారు. ఈ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించి ఈ అరెస్ట్ వారెంట్ వచ్చింది. నాడు చంద్రబాబు సహా పలువురిపై లాఠీచార్జ్ జరిగింది.

నాటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీశారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా చంద్రబాబు స్పందించకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

{document1}

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu will send his lawyer to Dharmabad court regarding Babli Project case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X