మీతో కలిసి ఉండంలో అర్థంలేదు: అమిత్ షాకు బాబు లేఖ, కారణాలు చెప్పిన సీఎం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోవాల్సిన కారణాలను వివరించారు.
ఎన్డీయే నుంచి బయటకు రావాలన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని వెల్లడించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీయేతో జతకట్టామన్నారు.
అవి నెరవేరక పోవడం వల్ల ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.

ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చనందున ఇంకా ఎన్డీయేలో కొనసాగడం సరికాదన్నారు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.
బీజేపీతో పొత్తు ద్వారా తాము ప్రజలకు చేయాల్సింది చేయలేకపోతున్నామని, అలాంటప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిణామాలను కూడా వివరించారు. బీజేపీతో పొత్తు లక్ష్యం నెరవేరలేదన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications