హ్యాపీ, మేరీ క్రిస్మస్: ఏసు దయతో స్వర్ణాంధ్రను చేస్తామన్న సీఎం చంద్రబాబు
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏసు ప్రభువు ఆశీస్సులు అవసరమని, ఏసు దయతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గుణదల మేరీమాత చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని కష్టాల్లే ఉన్నాయని, ఆదాయం లేదని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుతూ అన్ని చర్చిల్లో ప్రార్థనలు చేయాలని కోరారు.
పేద క్రిస్టియన్లను తమ ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. విజయాడలో క్రిస్ట్రియన్లకు ప్రధాన సమస్యగా ఉన్న స్మశాన వాటిక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ చర్చికి మరింత ప్రాముఖ్యత తీసుకొస్తామని అన్నారు.
రాష్ట్రంలోని క్రిస్టియన్లందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎంతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు టిడిపి నేతలు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.