క్రిస్మస్ వేడుకలు: ఎన్టీఆర్ భవన్లో బాబు, మెథడిస్ట్ చర్చిలో కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్లో క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు సేవాభావంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. యేసు క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ భవనానికి 2 ఎకరాలు, రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
జెరూసలెం యాత్రకు ఆర్థికసాయం అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తోటి మానవుల పట్ల ప్రేమ, దయతో మెలగటమే క్రీస్తు సందేశమని, ఆయన చూపిన బాటలో నడిచి ప్రపంచ శాంతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. క్త్రైస్తవ సంస్ధల ఆస్తుల పరిరక్షణ తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అబిడ్స్ చాపెల్రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు సీఎం కేసీఆర్ను ఘనంగా సన్మానించారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అబిడ్స్ చాపెల్రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
అబిడ్స్ చాపెల్రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కత్తి పద్మారావు, కె. కేశవరావు, ఎంపీ కవితతో పాటు పలువురు హాజరయ్యారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
అబిడ్స్ చాపెల్రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. క్రిస్మస్ కేకును సీఎం కట్ చేశారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
అబిడ్స్ చాపెల్రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. కేసీఆర్తో పాటు ఆయన కుమార్తె నిజమాబాద్ ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసస్ అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిదని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. 10 ఏళ్లుగా ఈ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నానని గుర్తు చేశారు.
మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
అబిడ్స్ చాపెల్రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు సీఎం కేసీఆర్ను ఘనంగా సన్మానించారు.
క్రిస్మస్ కేకును సీఎం కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసస్ అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిదని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. 10 ఏళ్లుగా ఈ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నానని గుర్తు చేశారు.
మొన్ననే మల్కాజ్గిరి మహేంద్రహిల్స్లో క్రిస్టియన్ భవన్కు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఇండియాలోనే గొప్పగా ఉండే విధంగా క్రిస్టియన్ భవన్ను నిర్మించితీరుతామని చెప్పారు. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కత్తి పద్మారావు, కె. కేశవరావు, ఎంపీ కవితతో పాటు పలువురు హాజరయ్యారు.