ఓటమికి కారణాలు తెలియట్లేదు అన్న చంద్రబాబువి నంగనాచి డ్రామాలు అన్న వైసీపీ కీలక నేత
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ నేతలతో సమావేశమై ఓటమికి గల కారణాలు ఇప్పటికీ అంతు చిక్కటం లేదని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడుకు ఓడిపోతామని ముందే తెలుసనీ వైసీపీ నేత రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు . ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలుసునని ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు .
ఏపీలో ప్రారంభమైన బీజేపీ గేమ్..!? మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో స్టార్ట్.. ? నెక్స్ట్ ఎవరు ?
ఓడిపోతామని తెలిసే లోకేష్ తో ఎమ్మెల్సీగా రాజీనామా చేయించలేదన్న విజయసాయి
ఇక చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారని ఆరోపించారు . అంతే కాదు ఎన్నికల తర్వాత భవిష్యత్ ఇలా ఉంటుందని తెలిసే చంద్రబాబు ముందు జాగ్రత్తగా ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రమోషన్లిచ్చారని పేర్కొన్నారు . పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కంట్రాక్లర్ల బిల్లులు చెల్లించారని చెప్పుకొచ్చారు . అన్నీ తెలిసే అన్నీ చక్కదిద్దుకునే , ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ నంగనాచి డ్రామాలు ఆడుతున్నారని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Recommended Video
రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబును నిలదీయాలంటూ ట్వీట్
ఇక రైతులను చంద్రబాబు మోసం చేశాడంటూ విజయ సాయి ఫైర్ అయ్యారు . రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారన్నారు . ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు.రైతలను మభ్యపెట్టి ఇప్పుడు తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు .
జగన్ పాలనలో రైతుల బతుకులు బాగు పడతాయన్న వైసీపీ కీలక నేత
రైతు భరోసా పథకం, ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రస్తుతం జగన్ పాలనలో రైతుల జీవితాలు బాగుపదతాయని పేర్కొన్నారు . సీఎం వైఎస్ జగన్ దార్శనికత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు . రైతుల మోముల్లో చిరునవ్వులు పూస్తాయని పేర్కొన్న విజయసాయి రెడ్డి ఏపీలో రైతాంగానికి సేద్యం ఇక పండుగ అవుతుంది అంటూ జగన్ ను కొనియాడారు.