టీడీపీ రోడ్షోలు అందుకే ఫ్లాప్ అవుతున్నాయ్ !? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు లింక్ పెట్టిన వర్మ.
హైదరాబాద్ : సంచనాలకు కేరాఫ్ అడ్రప్ రాం గోపాల్ వర్మ .. ఏపీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు. తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో రిలీజ్ చేయనీయకపోవడంతో బాబు రోడ్ షోకు జనం లేక వెలవెలబోతోన్న ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
వర్మ మార్క్ ..
తనదైన మార్క్ ప్రదర్శించడంలో వర్మ దిట్ట. తన సినిమాను మీడియాతో ఎలా ప్రచారం చేసుకోవాలో తెలిసిన వాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో రిలీజ్ కాకుండా అడ్డుకోవడంతో తనదైనశైలిలో స్పందించారు. ఇదివరకు కూడా చంద్రబాబు, లోకేశ్ గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ హీట్ ఉన్న నేపథ్యంలో రోడ్ షో లో జనం లేని ఫొటోను షేర్ చేసి తన మార్క్ ను మరోసారి ప్రదర్శించాడు.
ఏపీ ప్రజల నిరాశకు లోనయ్యారు
చంద్రబాబు రోడ్ షో కు జనం లేరని .. కారణం ఏంటంటే ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడమేనని సెలవిచ్చారు వర్మ. అందుకే చంద్రబాబు రోడ్ షోను అడ్డుకుంటున్నారని సెటైర్లు వేశారు.
సోషల్ మీడియాలో జోకులు
వర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోకు నెటిజన్లు కూడా అదేవిధంగా స్పందిస్తున్నారు. దీనిని బట్టి టీడీపీకి అధికారం కల్ల అని ఒకరు, జనసేనాని పగ్గాలు చేపట్టడం ఖాయమని మరోకరు కామెంట్లు పెట్టారు. మరో నెటిజన్ ఒక అడుగు ముందుకేసి జనసేన 160 సీట్లు సాధించి .. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాడు.