కన్నాపై చెప్పు విసిరిన ఘటనపై చంద్రబాబు స్పందన:రాష్ట్రానికి ద్రోహం చెయ్యొద్దు
అమరావతి: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై చెప్పు విసిరిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు.
Recommended Video
గురువారం ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేసిన నమ్మకద్రోహంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని చెప్పారు. చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలని...అలా పోరాడటం చేతగాకుంటే తమ వెంట నడవాలని చంద్రబాబు వారికి సూచించారు. అంతేకాని రాష్ట్రానికి ద్రోహం చేస్తే ఖబడ్దార్ అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు.
మరోవైపు రాష్ట్రానికి అన్ని వసతులు కల్పిస్తామన్న కేంద్రం స్టీల్ప్లాంట్ కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు కేంద్రం తీరుపై మండిపడ్డారు. " మేం కట్టే పన్నులు పది, పదిహేను ఏళ్లు వాయిదా వేయండి...స్టీల్ప్లాంట్ మేమే కట్టుకుంటాం"...అని చంద్రబాబు అని చంద్రబాబు ప్రతిపాదించారు. జగన్, పవన్లకు మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా?...అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్, పవన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.