బోండా ఉమాపై భూకబ్జా ఆరోపణలు: చంద్రబాబు సీరియస్
Recommended Video
అమరావతి: విజయవాడ భూకుంభకోణంపై ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. ఈ సంఘటనపై సోమవారం పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
బోండా ఉమకు షాక్, భార్యపై కేసు: రూ.40 కోట్ల భూవివాదం.. అసలేం జరిగింది?
భూకుంభకోణంపై సిఐడి ప్రాథమిక నివేదికను, డాక్యుమెంట్లను, ఎఫ్ఐఆర్ కాపీలను వారు ముఖ్యమంత్రికి అందించారు.
భూకబ్జా ఘటనపై చంద్రబాబు
ఈ సంఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బొండా ఉమా పాత్రపై ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. బొండా ఉమా పేరు ముందుకు రావడంంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు.
అతనికి అలా వచ్చిన భూమి..
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తమ తాతకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని రక్షించుకునేందుకు ఆయన వారసులు పోరాటం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భూమాఫియా ఆగడాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని చెబుతున్నారు
ఖండించిన బొండా ఉమ
భూదందాపై విచారణ చేపట్టిన సిఐడి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ సతీమణి సుజాతను ఎ8గా పేర్కొంటూ ఎఫ్ఐఆర నమోదు చేశారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను బొండా ఉమా ఇప్పటికే ఖండించారు.
స్వాతంత్ర్య సమరయోధుడికి ఆ భూమి
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన విజయవాడకు చెందిన కేశిరెడ్డి సూర్యనారాయణకు ప్రభుత్వం 1957లో సింగ్ నగర్ బుడమేరు కాల్వ పక్కన 5.57 ఎకరాలను కేటాయించింది. సూర్యనారాయణకు భార్య, ఇదదరుర కుమారులు, కూతురు ఉన్నారు. 1974లో సూర్యనారాయణ మరణించారు. దాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.