రద్దు చేసిన నగదు మారుస్తామని.... నగదును దోచేశారు
విశాఖపట్టణం : పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో వాటిని రద్దు చేసుకొనేందుకు తంటాలు పడుతున్న వారి దగ్గర మోసగాళ్ళు సొమ్ముచేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని తప్పుడు సమాచారంతో ఫోన్లు చేస్తూ బ్యాంకు వివరాలు తెలుసుకొంటూ బ్యాంకులో ఉన్న నగదును డ్రా చేసుకొంటున్నారు.
దేశంలోని వివిద ప్రాంతాల నుండి నగదు మార్పిడి కోసం కొత్త అకౌంట్ల తెరిచి రద్ద చేసిన నగదును మార్పిడి చేస్తామని డబ్బులు దోచుకొంటున్న మాయగాళ్ళ వలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మోసపోయారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖ జిల్లాలోని కేడిపేట కుచెందిన ఓ వ్యక్తికి ముంబాయి నుండి ఫోన్ చేశాడు. పెద్ద నగదు నోట్లను మార్పిడి చేస్తామని చెప్పాడు. బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకొన్నాడు. ఆయన అకౌంట్ లోని 41 వేల రూపాయాలను మోసగాళ్ళు మాయం చేశారు.
విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన పాలవ్యాపారి అప్పలరాజుకు కూడ బీహార్ నుంుడి ఓ ఫోన్ వచ్చింది. తాను ఎస్ బి ఐ ఉద్యోగిగా పరిచయం చేసుకొన్నాడు. బ్యాంకు అకౌంట్ వివరాలను తెలపాల్సిందిగా కోరారు.తన ఫోన్ లో ఉన్న ట్రూ కాలర్ అప్లికేషన్ ద్వారా పోన్ చేసిన వ్యక్తులు బీహార్ నుండి మాట్లాడుతున్నారని తెలుసుకొని ఎలాంటి సమాచంర ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. ఈ రకమైన మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు బ్యాంకు అధికారులు.