బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసిన.. ఏపి ముఖ్యమంత్రి జగన్
వైసీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపాదన తమ వద్దకు రాలేదని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి, ఇలాంటీ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన మీడియాను కోరారు. శనివారం నీతీ అయోగ్ సమావేశంలో పాల్గోనేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ బీజేపీ అధ్యక్షుడు కేంద్రహోంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. షాతో భేటి అనంతరం ముఖ్యమంత్రి జగన్ మీడీయాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలతోపాటు రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా విషయంలో అమిత్ షాతో చర్చించానని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అవసరాన్ని తెలియజేస్తూ ఓ లేఖను కూడ అమిత్ షాకు అందించారు.ఇక ఏపి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం యొక్క సహయ సహాకారాలు అందించాలని జగన్ కోరినట్టు తెలిపారు. ఇక మోడీ ప్రత్యేక హోదాపై చర్యలు తీసుకునేలా అమిత్ షా ప్రయత్నాలు చేయాలని కొరినట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ఇక నీతీ ఆయోగ్ సమావేశంలో కూడ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతామని ఆయన తెలిపారు. హోదా వచ్చే వరకు కేంద్రాపై ఒత్తిడి తెస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. శనివారం నీతీ ఆయోగ్ సమావేశంలో పాల్గోనడంతో పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడ నిర్వహించనున్నారు.